లక్ష్మీనగర్లో ఘనంగా నాగ్సాన్పల్లి సర్పంచ్ కుమారుడి వివాహం
వివాహ వేడుకకు హాజరైన పలువురు రాజకీయ నాయకులు, బంధువులు
పాపన్నపేట, ఆగస్టు 28 (తెలుగు ట్రెండ్స్): పాపన్నపేట మండల పరిధిలోని నాగ్సాన్పల్లి సర్పంచ్ దండెం సుశీల–దుర్గేష్ దంపతుల కుమారుడు మహిపాల్ వివాహం శుక్రవారం లక్ష్మీనగర్లోని ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది.
వివాహ వేడుకకు ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ కర్చర్ల నర్సింలుగౌడ్, సీనియర్ నాయకులు రవీందర్ గుప్తాతో పాటు పాపన్నపేట మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ఆయా పార్టీల నాయకులు, బంధువులు, స్నేహితులు, గ్రామ పెద్దలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.
తెలుగు ట్రెండ్స్ – రిపోర్టర్: పి. శ్రీనివాస్, పాపన్నపేట
