Type Here to Get Search Results !

పరికి బండలో విషాదం.. కుక్క కాటుతో యువకుడి మృతి



 

కుక్క కాటుతో యువకుడి మృతి.. పరికి బండలో విషాదం

రేబిస్‌ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి.. గ్రామంలో అలుముకున్న విషాదఛాయలు

మనోహరాబాద్ మండలం, సెప్టెంబర్ 5: మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పరిధిలోని పరికి బండ గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుక్క కాటుకు గురైన ఓ యువకుడు రేబిస్ వ్యాధి బారినపడి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించగా, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సమాచారం మేరకు.. సుమారు రెండు నెలల క్రితం పరికి బండ గ్రామానికి చెందిన సదరు యువకుడిని కుక్క కరిచింది. అనంతరం కొంతకాలానికి యువకుడిలో అనారోగ్య లక్షణాలు కనిపించినట్లు తెలుస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు అతడిని వివిధ ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స అందించారు.

పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు సమాచారం. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ఘటనతో పరికి బండ గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. కుక్క కాటుకు గురైనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి, వైద్యుల సూచనల మేరకు అవసరమైన చికిత్స, టీకాలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు.

కుక్క కాటు చిన్న గాయమేనని నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే వైద్య సహాయం తీసుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు సూచిస్తున్నారు. V

తెలుగు ట్రెండ్స్ న్యూస్ | తూప్రాన్  హ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Bottom Post Ad

తెలుగు ట్రెండ్స్ న్యూస్ వార్తలు के लिए यहां क्लिक करें।

#codes

🌐 Select Language